Saturday 22 December 2012

Andhra Pradesh Nayee Brhamana Seva Sanghamu Rastra Adyakshulu D.V.Narendra Nayee














nayee brhamin photo gallery

nayee brhamana poetry


barber
నాయీలకు అంట కత్తెర
నాయీ... అంటే సంస్కృతంలో ‘ముందు’ అని అర్థం ధ్వనిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రా హ్మణులతో ఏ కార్యం తలపెట్టినా ముందుగా మంగలి కులం వారి చేయి పడాల్సిందే! కనుకనే ఎంతోకాలంగా వీరు ‘నాూ బ్రాహ్మణులు’గా పిలువబడుతున్నారు. కనుకనే ప్రజాకవి వేమ న ఏమన్నాడో చూడండి... చిత్తశుద్ధి లేని జపమేల/ బ్రాహ్మణ జలముకన్న/ మంగలి జలము హెచ్చు/ విశ్వదాభిరామ విను రవేమా... అని వీరి ప్రాధాన్యతను ప్రస్తుతించారు. చరిత్ర లోనూ వీరి పూర్వీకులు తగిన స్థానం సంపాదించారనే చెప్పొ చ్చు. 

విజయనగర రాజుల కాలంలో సెైతం వీరి ప్రతిభ వెలుగు చూసింది. అప్పట్లో క్షురకర్మపెై పన్ను విధిస్తే ‘కొండోజు’ అనే నా ూబ్రహ్మణుడు అళియ రామరాయలును మెప్పించి ఆ పన్ను భారాన్ని తీసేయించారు. ఇక సామాజిక పరంగా చూస్తే వీరి సేవ క్షురకర్మకే పరిమితం కాలేదు. మహిళలు మంత్రసానులు గా నేటికీ మారుమూల ప్రాంతాలలో పురుడుపోస్తున్నారు. పు రుషులు ఆయుర్వేద వెైద్యులుగా, డోలుసన్నాయి మంగళ వా యిద్యకారులుగా మన్ననలు పొందుతున్నారు. అయితే మారుతున్న పరిణామ క్రమంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది!

ఎన్నో రంగాలలో తమ ప్రతిభ చాటుకుంటున్నా నేటికీ ఎదు గూబొదుగూలేని జీవితం నాూబ్రాహ్మణులది. రాష్ర్టంలో సు మారు 9లక్షలమంది నాూ బ్రాహ్మణులు ఉన్నారు. వీరిలో ఎ క్కువభాగం కుల వృత్తిపెై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ర్టంలో విస్తరించిన 2.50లక్షల క్షౌరశాలల్లో దాదాపు నాలుగు లక్షల మంది వృత్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నాూ బ్రాహ్మణులు సాంప్రదాయ వృత్తికు పరిమితం కావడంతో అ క్కడివారికి రోజలు గడవటమే కష్టంగా మారింది. ఇక పట్టణ ప్రాంతాలకు వలసవచ్చిన నాూలలో కొందరు మాత్రమే అ దునాతన సెలూన్‌లు నడుపుతున్నారు. 

అగ్రకులాలు నడుపుతున్న బడాబడా సెలూ న్‌ల స్థాయిలో సేవలందిస్తున్నారు. చాలా మంది రోడ్డు పక్కన చిన్న చిన్న బంకులు పెట్టుకునో, ఫుట్‌పాత్‌ మీద పట్టా పరుచు కునో కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఇక మధ్య తరగతివారి కోసం వీరు నిర్వహించే సెలూన్లతో వీరు బొటాబొటీ జీవ నం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ కలిగిన అనేకమంది నాూ బ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి, బ్యాంకుల నుండి తగిన ఆర్థిక సహాయ అందకపోవడంతో బడాబా బులు నిర్వహిస్తున్న సెలూన్‌లు, బ్యూటీ పా ర్లర్లలో పనికి పరిమితమయ్యారు. అంటే కష్టం నాూలది, కాసులు బడాబాబులవి. 

tablelellllఈ క్రమంలో క్షురకవృత్తి ఇప్పుడు బడా వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. హైదరా బాద్‌, విశాఖ, తిరుపతి, విజయవాడ వంటి నగరంలో హైటెక్‌ సెలూన్‌ నిర్వహించాలంటే కనీసం 25 లక్షల రూపాయలు పెట్టుబ డిపెట్టాలి. హైదరాబాద్‌ నగరంలో సెలూన్‌ ప్రారంభించాలంటే పగిడీ రెండు లక్షల నుం డి పది లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇక అద్దెల రూపేణా నెలకు లక్ష రూపాయలు చెల్లిం చాలి. ఈ సెలూన్‌లో వినియో గించే ఒక కుర్చీ ఖరీదు పాతిక వేల రూపాయల పెైమాటే. ఇవి కాక సెలూన్‌లో పనిచేసేవారికి నెల జీతాలు, కాస్మోటిక్స్‌... ఇలా మరెన్నో ఖర్చులు. ఇక్కడ క్రాప్‌ చేయటంతోపాటుగా బా డీ మసాజ్‌, స్టీమ్‌ బాత్‌, స్థూల కాయాన్ని తగ్గించటం వంటివి ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమా లు కూడా నిర్వహిస్తుంటారు. 

వీటిని నిర్వహించగల నేర్పు, నెై పుణ్యం వీరికి ఉన్నప్పటికీ ఆర్థి క స్థోమతలేక పోవడం, జాతీ య బ్యాంకులు సహకరిం చకపోవటంతో హైటెక్‌ సెలూన్‌ లలో నెల జీతగాళ్లుగా పని చేస్తున్నారు. ఈ హైటెక్‌ సెలూన్ల నిర్వహణ లాభసాటి వ్యాపారం కావటంతో అగ్రకులానికి చెం దిన వారు రాష్ర్ట వ్యాప్తంగా బ్రాంచీలు పెట్టిమరీ నడిపిస్తూ, డిప్లమో కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌ కూడా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో మెన్స్‌ బ్యూటీ పార్లర్‌కు పెట్టు బడిపెట్టారంటే ఇది ఎంత లాభసాటి వ్యాపారంగా మా రిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ధోరణి మారాలంటే నాూ బ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సి ఉంది. గతంలో వీరిని ఎయిడ్స్‌ సమస్య వెంటాడింది. క్షవరం చేయటానికి ఉపయోగించే కత్తు ల ద్వారా ఎయిడ్స్‌ వ్యాధి విస్తరిస్తుందనే ప్రచారం ముమ్మరం కావటంతో బ్లేడు కత్తిని ఉపయోగించటం ప్రారంభించారు. 

అయితే షేవింగ్‌, ట్రిమ్మింగ్‌ చేయటానికి ఆ బ్లేడుకత్తి ఉప యోగిస్తే మిసమిసలాడే ముఖం ముదిరిపోతుందనే ప్రచారం ఈ మధ్య ముమ్మరం కావటంతో సెలూన్లలో అనివార్యంగా ఎలక్ట్రికల్‌ మిషన్లు వాడాల్సి వస్తుంది. సెలూన్‌లో ఎలక్ట్రికల్‌ మిషన్‌ వాడకానికి శ్రీకారం చుడితే క్రమక్రమంగా షాపులోని వస్తువులన్నీ అత్యాధునిక పరికరాలవెైపు మొగ్గు చూపాల్సిందే! అన్ని పరికరాలూ మార్చు కోవడానికి వారిి తగినంత ఆర్థిక స్తోమతులేదు. దీంతో కస్టమర్లు దూరమవుతున్నారు. ఇక వీరిని వెంటాడుతున్న మరో సమస్య కాస్మోటిక్స్‌ ఖర్చులు. ఇప్పుడు చిన్న చిన్న సెలూన్లలో కూడా మేకప్‌ చేయ టం, జుట్టు కు రకరకాల రంగులు డెై చేయటం సర్వసాధారణమైంది. కను క కనీసం ఆయా వస్తుపులపెై తమకు రాయితీలు కల్పించాలని నాూబ్రాహ్మణులు కోరుతున్నారు. తమ వృత్తిని కోలుకోలేని దెబ్బతీస్తున్న బడా వ్యాపారులను కట్టడి చేయాలని నాూ బ్రాహ్మణులు వేడుకొంటున్నారు. 

ఉద్యమ పునాదులు వేస్తున్నాం
Guntuమా పూర్వీకులు ఆయిష్‌ కర్మ (వెైద్యం) చేసేవారు. మంగలి కత్తితో సక్సస్‌ఫుల్‌గా సర్జరీ చేసేవారు. చెరకుడు మావాడే. ఇప్పటీకీ రాష్ర్టంలోని గ్రామాలలో 60 శాతం ఆర్‌ఎంపీ డాక్టర్లు మావేళ్లే. తెలంగాణ, రాయలసీమల్లో మంత్రసాని బాధ్యతలు చేపడుతుంది నాూ బ్రాహ్మణ స్త్రీలే. ‘దాయి’లుగా పిలువబడుతున్న వీరికి 1985 వరకు ప్రభుత్వం గౌరవ వేతనం అందించేది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ విధానానికి తిలోదకాలు పలికింది. ఇక కార్పొరేట్‌ ఆస్పత్రులతో ఇప్పటికీ 80శాతంమంది నాూ బ్రాహ్మణులే కాంపౌండర్లుగా పని చేస్తున్నారు. వాయిద్య వృత్తి కూడా హైజాక్‌ చేయబడింది. కళల్ని తరతరాలుగా కాపాడుకొస్తున్నాం కనుకనే... నాటి రాజులు దేవాలయాల్లో అర్చకులతోపాటు వాయిద్యకారులుగా నాూ బ్రాహ్మణులకు తగిన ప్రాధా న్యత ఇచ్చేవారు. ఇప్పుడు నా ూ బ్రా హ్మణులకు ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వ కపోవడం శోచనీయం. భగవంతుడిని మంగళవాయిద్యాలతో నిద్రలేపాలి, మంగళ స్నానం చేయించేప్పుడు మంగ ళవాయిద్యాలు మ్రో గించాలి. అయితే ఈ ఆనవాయితీకి చా లా దేవాలయాలు తిలోదకాలు పలికాయి. కనుకనే ఉద్య మానికి పునాదులు వేస్తున్నాం, వినతిపత్రాలతో ప్రారంభమయే ఈ ఉద్యమం మా హక్కులు సాధించేవరకూ కొనసా గిస్తాం. 

గిన్నిస్‌ రికార్డ్‌
Taaహైదరాబాద్‌ రవీంద్రభారతిలో మొత్తం 35 తాళములతో పంచగతుల ప్రసార కార్యక్రమాన్ని 13 నిమిషాల వ్యవధి లో డోలు వాయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు తరిగోపుల నారాయణ. అయితే సర్టిఫికెట్‌ తీసుకోవడానికి నిరాకరిం చారు. ‘‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సర్టిఫికెట్‌ను నేను తిరస్కరించలేదు... విద్వత్‌కు గుర్తింపు ఇవ్వాలని కోరుతు న్నాను. ఆ కేటరిగిలో సర్టిఫికెట్‌ ఇస్తే స్వీకరించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు..’ అంటారు నారాయణ. ఇక దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలూ మరెన్నో పురస్కారాలు అందుకున్న వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మా పుర స్కారం రాకపోవడం ఆశ్చర్యం.ఇదే అంశంపెై ఆయన స్పందన చూడండి. ‘సంగీతంలో నిష్ణాతులెైన నాూ బ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నప్ప టికీ వారికి తగిన గుర్తింపు లేదు. ప్రభుత్వం కూడా వారిని పద్మ అవార్డులకు దూరం చేస్తోంది. పద్మా అవార్డు కాదు కదా... కనీసం ఉగాది పురస్కారా లకు కూడా ఏ ఒక్క నా ూ బ్రాహ్మణుడూ నోచుకోలేదు...’ అంటూ పెదవి విరిచారు. కళా ప్రదర్శనలో నాూ బ్రాహ్మ ణులు కళాకౌశలం పరాకాష్టకు చేరుకున్నా విద్యకు దూరం కావడంతో తగిన గుర్తింపునకు నోచుకోలేకపోతున్నారని అ భిప్రాయపడ్డారు. చట్టసభలలో నాూ బ్రాహ్మణుల ప్రాతి నిధ్యం లేకపోవడం కూడా మరోకారణంగా పేర్కొన్నారు.

బడుగుల ఆత్మాభిమానికి ప్రకాష్‌ ఓ మచ్చుతునకబ
Caaఆరవ తరగతి చదువువున్న సిహెచ్‌ ప్రకాష్‌ ప్రమాదవశా త్తు రెండు కాళ్లు కోల్పోయినా ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులు కోలేదు. ఈ ప్రమాదం జరగ డానికి ఏడాది ముందు తన తండ్రి మృతి చెందాడు. కస్టా లన్నీ కట్టకట్టుకని వచ్చినా సహవిద్యార్థుల ప్రోత్సాహం తో పదవ తరగతి పూర్తి చేశా డు. భవిష్యత్‌ అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ వికలాంగు డను... అంటూ వీధిన పడలేదు, బిక్షాటన చేయలేదు. ఉన్న త చదువులు చదివే స్తోమతులేని ప్రకాష్‌ అప్పట్లోనే విక లాంగుల కోటాలో పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ ప్రారంభించి స్వశ క్తిపెై నిలిచి కుటుంబాన్ని పోషించే ప్రయత్నం చేశాడు. అ యితే సామాన్యుల చేతుల్లోకి సెైతం సెల్‌ఫోన్లు రావడంతో రాబడికి గండిపడింది. 
దీంతో గత్యంతర లేక కుల వృత్తి చేయడానికి సిద ్దపడ్డాడు. అయితే రోజంతా కొయ్య కాళ్లపెై నిలబడి పనిచే యడంతో రాత్రయ్యే సరికి నరకాన్ని చూ డాల్సి వస్తోందం టాడు. జెైపూర్‌ కాళ్లు అమర్చుకుంటే కొం త ఉపశమనం ఉంటుందంటాడు. అయితే కుటుంబ పోష ణే కష్టమైతే ఇక జెైపూర్‌ ఫుట్‌కు డబ్బులెక్కవి? అని బిక్కమె హం వేశాడు. కనుకనే దాతలెవరెైనా వచ్చి తన కన్నీరు తు డుస్తారని ఆశగా ఎదురు చూస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు.

Nayi Brhamin Associations

ANDHRA PRADESH NAYEE BRAHMANA SEVA SANGHAM
Andhra Pradesh Nayee Brahmin Sevaa Sangham
AP NAYEE BRAHMANA SEVA SANGAM - TWIN CITIES
How do you feel about BC Times
 

Nayi Brhamin History

ఆంధ్రప్రదేశ్‌లోని కులాలలో మంగలి కులం ఒకటి. వీరిని నాయీ బ్రాహ్మణులు అని కూడా పిలుస్తారు. బి.సి.గ్రూప్ ఎ, సీరియల్ నెం. 16 వృత్తిరీత్యా క్షౌరం చేయడం వీరి పని. మంగలి కుల పురాణం ప్రకారం ధనవంత్రీ వైద్యం, కులవృత్తి క్షౌరం, భజంత్రీ మేళం వీరి వృత్తులు. మంగలి వాళ్ళు కొండమంగలి, శ్రీమంగలి, అద్దం మంగలి అని మూడు రకాలు. వీరి తండ్రి అంగారకుడు. అంగారకుని తండ్రి సుమంగలి. అంగారకుడు అయోని పుత్రుడు అగ్ని నుండి పుట్టినవాడు. ఇతనికి నాభక, శౌరకారుడు, కళ్యాణభక్తుడు, శుభమంగళ అనే పేర్లు కూడా ఉన్నాయి. అంగారకుని భార్య ధుంరావతి. ధుంరావతి భృగ్మాఋషి కూతురు. ఈమె కూడా అయోని పుత్రిక. భృగ్మాఋషి జడల నుండి పుట్టింది. వీరిరువురి  సంతానం ధనపాలకుడు, ఋషిపాలకుడు, అధిపాలకుడు. ధనపాలకుడు పెరిగి బిలాస్‌పురంలో నైనావతి శంకరుని దగ్గరకు వెళ్ళి, పూజ చేయడం వల్ల శ్రీమంగలి అయ్యాడు. అతిపాలకుడు తన తండ్రియైనా అంగారకుని దగ్గరే ఉండి విద్యాబుద్ధులు, కొన్ని శ్లోకాలు, కొన్ని పయాలు నేర్చుకొని, తండ్రి దగ్గరే ఉన్నాడు. 
కొన్నిరోజులకు అంగారకుడు అధిపాలకునితో నాకు వృద్ధాప్యం వచ్చింది. నేను స్వర్గస్థుడను పొందడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పెద్దన్నయ్య ధనపాలకుడు తిరుపతి కొండలపై ఉన్నడు. మీ చిన్నన్నయ్య ఋషి పాలకుడు బిలాస్‌పురంలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొని వస్తే మీ ముగ్గురికి సమభాగం పంచి ఇస్తానన్నాడు. అధిపాలకుడు తండ్రి ఆజ్ఞననుసరించి పెద్దన్నయ్య దగ్గరకు వెళ్తాడు. ధనపాలకుడు మాంసాహారి, మధుపానీయాలు తీసుకుంటాడు. తిరుపతి కొండలపైకి వెళ్ళి భోజనం చేయకపోతే అతని తల సహస్ర వక్కలవుతుంది. అనే శాపం ఉండడం వల్ల అధిపాలకుడు పెద్దన్నయ్య దగ్గర మధుమాంసాలతో కూడిన భోజనం చేసి తీసుకొని వస్తాడు. అక్కడి నుండి చిన్నన్నయ్య దగ్గరకు అతన్ని తీసుకొని వస్తాడు. అంగారకుడు చిమ్మటేశ్వరస్వామి భక్తుడు. మధుమాంసాలు తినడం నేరంగా భావించి, అధిపాలకుని దూరంగా వుండు నీవు. మధుమాంసం ముట్టుకున్నావు. మనది శీవమతం. చాలా నియమ నిష్టలు కలిగి ఉండాలే అని, పెద్దవారిద్దరిని పిలిచి మీ తమ్ముడు విద్యాబుద్ధులు, శ్లోకాలు, పద్యాలు నేర్చుకున్నాడు. మనకు ఒక అర్థిబిడ్డ ఆడబిడ్డ ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండి అధిపాలకుడు ఒక నిలువుటద్ధం పట్టుకొని మీ ఇద్దరు అన్నయ్యలను యాచిస్తూ, నాయీ బ్రాహ్మణ కులపురాణంను పటం ద్వారా చెబుతూ జీవిస్తాడు. మిమ్ములకాదని ఇంకెవ్వరిని అడిగినా పత్తికాయ లెక్క తల పగిలి చస్తాడని చెప్పి కాశిలో పటం, కంచిలో సన్నతులు, ఒక రాగి శాసనం రాయించినాడు. మీరు ఇతనిని కాదంటే, ఇతనికి పెట్టకపోతే నరకం పాలైపోతారు. కాశిలో గోహత్య, శిశుహత్య, బ్రాహ్మణ హత్య చేసినంత పాపం తగులుతుంది. అని అందరికి సమభాగం పంచి స్వర్గస్థుడవుతాడు. అపుడు ధనపాలకుడు తిరుపతి కొండలపైకి వెళ్ళి జగన్నాథునికి సేవ చేస్తూ కొండ మంగలి అవుతాడు. ఋషిపాలకుడు బిలాస్‌పురంలో నైనావతి శంకరుని సేవచేస్తూ శ్రీమంగలి అవుతాడు. అధిపాలకుడు తండ్రి చెప్పిన రీతిగా నిలువుటద్ధం పెట్టి నాయీ బ్రాహ్మణ కులపురాణంను పటంతో కథ చెబుతూ అద్దం మంగలి అని పిలువబడుతూ ఇద్దరు అన్నయ్యలను యాచించి జీవనం సాగిస్తున్నారు.
మంగలి కులం ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది?
పార్వతి తపస్సు చేసి శంకరున్ని సాధించుకున్నది. శంకరుడు తపస్సుకు సంతోషపడి సరే మరి తొమ్మిది గడియాలాయె నువ్వు వచ్చి మరి మనం పెళ్ళి చేసుకోవాలె ఎట్లా అని పార్వతిని అడుగుతాడు. మనము మూడో ముడివేసుకోవాలంటే ఒక పరమభక్తుడు కావాలె. పెండ్లికి పనివాడు కావాలె. పనివాడు లేనిది మనం ఎట్లా జేసుకుంటం. పెండ్లికి చాప పరిచేది ఉంటది. పొరొన్లు పట్టేది ఉంటది. గరిగబుడ్లు తెచ్చేది ఉంటది. పందిరి వేసేది ఉంటది. పోలు పోసేది ఉంటది. ఇవన్ని చేయడానికి ఒక పనివాడు గావాలె. వాడు తల్లిదండ్రులకు పుట్టినవాడు వద్దు. అయోనిపుత్రుడు వరాన బుట్టాలె. అతడు పెండ్లి చేస్తే మోక్షం అని ఆలోచించసాగారు.
మంగళ గళ మహాఋషి, గౌతమ మహాఋషి, అత్గ్నిఋషి, వాయుఋషి, అంగిరా ఋషి అనే అయిదుగురు ఋషులు తపస్సు చేస్తుండగా రాక్షసులు వచ్చి నలుగురు ఋషులను చంపేవరకి పెద్దవాడు సుమంగలి ఇక్కడ చనిపోతానని గంధమదన పర్వతం మీది పారిపోయి, అక్కడ మహంగాలి అనే వృక్షంను చూసుకొని త్రిమూర్తుల గురుంచి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దేవతలు, సూర్యచంద్రులు అందరూ ప్రత్యక్షమవుతారు. శంకరుడు సుమంగలి నీ తపస్సుకు మెచ్చినా ఏం కావాలని అడిగితే నాకు కుమారుడు కావాలని కోరుకుంటాడు. అయితే భార్యను జేసుకో సంతానం కలుగుతుంది. అంటే భార్యను చేసుకోను. భార్య లేకుండా కావాలంటే త్రిమూర్తులు ఆ గంధమదన పర్వతం మీద నాలుగు వైపుల నాలుగు మూలలకు విభూతి గుండం వూసి, బ్రహ్మ ఆ గుండానికి ద్వాదశి మంత్రంను, విష్ణుమూర్తి అష్టాక్షరీ మంత్రంను, ఈశ్వరుడు పంచక్షరీ మంత్రంనుపదేశించి యజ్ఞం చేసేవరకు మంటలు పైకి లేత్తాయి. ఆ మంటల నుండి పరమభక్తుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాన్ని బ్రహ్మ జూసి నాభక అని, విష్ణుమూర్తి జూసి శౌరకారుడు అని, ఈశ్వరుడు అంగారకుడు అని, పార్వతి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం పుట్టనున్నది, కలియుగంలో మాత్రం కళ్యాణ మంటపానికి కార్తేయం నీదే కుమ్మర అని నువ్వు కళ్యాణ భక్తునివి అవుదువు గాక అని కళ్యాణ భక్తుడు అని పేరు పెట్టింది. సుమంగలి నాయనా నా వంశం సంతానం లేక నిడు వంశం అవుతుందని, వంశం అభివృద్ధి కావాలని నిన్ను తపస్సు ద్వారా సాధించుకున్నాను. కాబట్టి నీ పేరు శుభమంగళ అని పెడుతున్న అని పేరు పెట్టినాడు.    

Nayee Brahmin Community


భారదేశంలో మొట్టమొదట వైద్య సైన్సును ప్రారంభించింది మంగలివారు. వైద్య శాస్త్రానికి మొదట మెట్టు శరీరంపై పెరుగుతున్న వెంట్రుకల్ని కత్తిరించాలని కనుక్కోవడం. ముఖ్యంగా మానవుల తలపై, పురుషుల ముఖంపై విపరీతంగా పెరిగే వెంట్రుకలు రెండు విధాల మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒకటి తలపై పెరిగే వెంట్రుకలు మెదడుకు సరఫరా కావలసిన ఆహారాన్ని వెంట్రుకలు తినేస్తాయి. రెండవది విపరీతంగా పెరిగే వెంట్రుకల్ని దుమ్ము, ధూళిబాగా పట్టేసి అందులో ఆనారోగ్యానికి కారణమైన క్రిములకు నిలయమౌతాయి. 
మనలో చాలామందిమి పేండ్లు, చీరపేండ్లు వెంట్రుకల్లో పడినప్పుడు నెత్తి, ఒళ్లు చిరాకుకు గురి కావడమే కాకుండా వాటివల్ల (తీవ్ర) అనారోగ్యానికి గురయ్యే విషయం ఎరుగుదుము. శరీరంపై పట్టే చీరపేను కూడా వెంట్రుకలు అధికంగా ఉన్న భాగంలోనే పడతాయి. మానవ అనారోగ్యానికి మూలమయ్యే ఈ వెంట్రుకల పెరుగుదల నుండి రక్షించడానికి రూపొందిదే క్షవరం సైన్సు. ఇది ప్రపంచంలోనే పుట్టిన మొట్టమొదటి వైద్య సైన్సు. ఈ సైన్సును కనిపెట్టింది అభివృద్ది చేసింది భారతదేశంలో మంగలివారని చెప్పక తప్పదు. ప్రపంచంలో క్షవరం సైన్సు అంటే ఏమిటో తెలియని రోజుల్లో భారతదేశంలో క్షవరం సైన్సు ఉనికిలోకి వచ్చింది. ఈ సైన్సును అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలని మొట్టమొదటి ప్రయత్నం చేసిన మూర్ఖమానవులు బ్రాహ్మణ సన్యాసులు. సన్యాసులకు, సంసారులకు మధ్య సంబంధం విడిపోయింది. క్షవరం సైన్సుపట్ల బ్రాహ్మణ సన్యాసులకున్న వ్యతిరేక భావం వల్లే. అందుకే ఈనాటికీ బాగాక్షవరం పెరిగిన వ్యక్తిని "సన్యాసిగాడు" అని తిట్టేపదం ఉంది. బ్రాహ్మణ సన్యాసిని దళిత బహుజన కులాలవాళ్ళు ఎప్పుడూ గౌరవించలేదు. వాళ్ళు "సంసారిని" అంటే కుటుంబీకున్ని ఎక్కువగా గౌరవించారు. 
బ్రాహ్మణ సన్యాసులకు, మంగలి సైంటిస్టులకు మొట్టమొదట జరిగిన తీవ్ర సంఘర్షణలోనే సన్యాసులు క్షవరం చేసుకోనిరాకరించారు. మంగలి సైంటిస్టులు క్షవరపు సైన్సును అభివృద్ధి చెయ్యనారంభించారు. ప్రాచీన కాలంలో ఈ సంఘర్షణ జరుగుతున్నపుడు ప్రపంచ దేశాల్లో దేంట్లో కూడా క్షవరం చేశుకునే సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. మొదట్లో భారతదేశం మంగలి సైంటిస్టులు సన్యాసుల వెంట్రుకల పెంపకం, స్నాన రహిత జీవితానికి భిన్నంగా, ఫుర్తిగా గుండుగీకే పద్ధతిని కనిపెట్టారు. ఈ విధంగా గుండు గీసుకునే సంస్కృతిని దేశం మొత్తం మీద ప్రచారం చేశారు.
ఈ విధంగా నున్న గుండు గీకడం, పురుషుని మొఖంమీది గడ్డం గీకడం వంటి ప్రక్రియను చాలా శాస్త్రీయ పద్ధతిలో మంగళ్ళు కనిపెట్టారు. పోతే అది కనిపెట్టగానే సరిఫొదు, ఆ పని చెయ్యగల ఇనుపకత్తిని తయారుచెయ్యడం కూడా మన భారతదేశంలోనే ముందు తయారైంది. భారతదేశంలో మంగలికత్తి అతివాడిగా ఉండి నెత్తి, గడ్డం గీకడానికి అనువుగా తయారైన నాటికి ఏ దేశంలో అటువంటి కత్తి ఉనికి కనబడదు. ఇటువంటి ఇనుప కత్తితో క్షవరం చేసుకోవడాన్ని హిందూ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్న దశలోనే మనదేశంలో జైన తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటులో జైనులు ఆడ, మగ తేడా లేకుండా అందరూ గుండు గీక్కునే సంస్కృతిని ప్రచారం చేశారు. అదే సంస్కృతిని బుద్ధుడు వచ్చాక బౌద్ధ సంఘాలు నియమంగా పెట్టాయి.                
బౌద్ధ సంఘాలకు మొట్టమొదటి నాయకుడుగా ఎదిగిన వారిలో ఉపాలి గొప్ప మంగలి. అతనే బుద్ధునికి క్షవరం చేసే సైన్సును నేర్పాడు. బుద్ధుడు స్వయంగా గుండ్లు గీకేవాడు. అది కూడా ఆడ, మగ తేడాలేకుండా గుండు గీక్కోవడానికి నిరాకరించి గడ్డాలు, తల పెంచుక తిరిగే బ్రాహ్మణులు ఎంతోమంది తీవ్రమైన రోగాలతో చనిపోయారు. ఈ స్థితి నుండి బయటపడేందుకు శంకరాచారి క్రీ.శ. 7వ శతాబ్ధంలో బ్రాహ్మణులు కూడ గుండు గీక్కోవాలని ప్రచారం చేశాడు. ఆ తరువాత బ్రాహ్మణ ఆరోగ్యం కొంత మెరుగైంది. ఇప్పుడు మనం చూసే బ్రాహ్మణ పూజారి గుండు శంకరాచారి కాలం నుండీ వచ్చిందే.
మంగళ్ళు నిర్వహించిన రెండవ వైద్య సైన్సు మంగళి కత్తితో గడ్డలు, పుండ్లు వాతిని చెట్ల మందులు పోసి మత్తు తెప్పించి ఆపరేషన్‌లు చెయ్యడం. భారతదేశంలో బ్రాహ్మలు బ్రిటిష్ వాళ్ళు వచ్చేంతవరకు డాక్టర్ వృత్తి పూర్తిగా వ్యతిరేకించారు. కాని వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది మంగళ్లే. మంగళి స్త్రీలు దాయమ్మలుగా ఉండి కానుపులు చేసే సైన్సును తయారుచేశారు. అంతేకాక గ్రామ గ్రామాన చెట్ల మందులతో రోగాలు నయం చేసే వైద్యం మంగలి డాక్టర్ల చేతుల్లోనే ఉండేది. బ్రాహ్మణ సన్యాసులు ఈ వైద్యాన్ని కూడా వ్యతిరేకించారు. కాని మంగలి సంటిస్టులు బ్రాహ్మణ మూర్ఖత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి పూనుకోబట్టే భారతదేశంలో ఈ మాత్రం వైద్య సైన్సు బతికున్నది. 
మంగలినీతి:
మంగలినీతి లేకుండా ఎన్నో బ్రాహ్మణ, అగ్రకులస్తుల తలలు తెగిపోయేవి. బ్రాహ్మణ పూజారులు గుండుగీక్కోవడం మొదలు పెట్టాక, కోమట్లు, రెడ్లు, వెలమలు, కమ్మలు, భూస్వాములుగా ఎదిగాక క్షవరపు సైంటిస్ట్ అయిన మంగళ్ళని ఎంతో అవమానించేవారు. కాని అవమానించిన వారి పట్లకూడ మంగళ్ళు నీతితో క్షవరం చేశారు. తిట్టినవాని, కొట్టినవాని తలను తప్పియ్యాలంటే మంగళ్ళకు పెద్ద సమస్య కాదు. తమ చేతికి రాని జుట్టు ఉండదు. తమ చేతికి దొరకని మెడ ఉండదు. చేతిలో బ్లేడును మించిన కత్తి వేలఏండ్లుగా ఉండనే ఉన్నది. గడ్డం చేసేటప్పుడు తిట్టినోని గొంతు కోయవచ్చు. తలగీకినప్పుడు కొయ్యవచ్చు.  కటింగ్ చేసే అప్పుడు కత్తెర గొంతులో దించవచ్చు. కాని మంగలి నీతికి కట్టుబడి ఉన్నారు. కనుక వాళ్ళు శత్రువును కూడ చంపలేదు. ఇ మంగలినీతే సమాజాన్ని కాపాడింది. 
బ్రాహ్మణుని అవినీతి మంగళికి ఉంటే భారత దేశం ఎప్పుడో అంతమొందేది. కనుక బ్రాహ్మణులు అగ్రకులాల వారు మంగళ్ళ నుండి నేర్చుకోవలసిన మహా పాఠాలు ఎన్నో ఉన్నయి. 
"మంగలినీతి, చాకలి శుభ్రత లేకుండా, భారతదేశం బతికుండేది కాదు".